మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు కసరత్తు ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో 200 యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళ సంఘాల ద్వారా తమ పెట్టుబడిగా 10శాతం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇచ్చిన రుణంలో 35శాతం రాయితీ అందించనున్నారు.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అతివలు వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. నాణ్యత, ఆహార భద్రత, నియంత్రణ, పరిశుభ్రమైన ఆహార పదార్థాల తయారీ విధానాలపై అవగాహన కల్పిస్తున్నది. ఖమ్మం జిల్లాలో 200 యూనిట్లను ఏర్పాటు చేయాలని కార్యా చరణ రూపొందించింది. మహిళా సంఘాలు తమ పెట్టు బడిగా 10 శాతం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇచ్చిన రుణంలో 35శాతం రాయితీ అందించనున్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో స్వయం సహాయ సంఘాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారానికి ఎంతో అవకాశం ఉన్న ఆహార తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించింది. వీటి ద్వారా వస్తున్న ఆదాయంలో ఆయా కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనలో ఆసక్తి ఉన్న మహిళా సంఘాలను గుర్తించి వారికి బ్యాంక్ లింకేజ్తో రుణాలను మంజూరు చేయించనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోని జీవనోపాధుల విభాగం ఆధ్వర్యంలో ఈ ఆహార తయారీ రంగం వైపు మహిళా సంఘాలను ప్రోత్సహించి వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 200 ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యత, ఆహార భద్రతా, నియంత్రణ, పరిశుభ్రమైన ఆహార పదార్థాల తయారీ విధానాలపై సరైన అవగాహన కల్పిస్తున్నారు. మంచిపేరు, బ్రాండింగ్, మారెటింగ్ నైపుణ్యం తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించి వ్యాపార రంగంలో రాణించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తయారు చేసిన ఆహార పదార్థాలను సరఫరా వ్యవస్థలతో అనుసంధానించి వ్యాపారం చేసే సామర్థాన్ని కల్పిస్తున్నారు. మహిళ సంఘాలు తమ పెట్టుబడిగా 10శాతం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చిన్న ఆహార తయారీ సంస్థల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడంతో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతులు, మహిళల స్వయం సహాయక బృందాలు(స్వయం సహాయక సంఘాలు) రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్పీవో) వ్యాపారాలు నిర్వహించడానికి విసృ్తతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాలు పొదుపులో గణనీయమైన పురోగతిని సాధించాయి. వారు తిరిగి చెల్లించే రికార్డులో ఎన్పీఏ- 97% స్థాయి ఉత్తమంగా ఉంది. దీంతో వాటికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
మహిళలు వ్యాపార రంగంలో రాణించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. వ్యక్తిగత ఆహార శుద్ధీకరణ సూక్ష్మ(మైక్రో) సంస్థలకు పెట్టుబడిలో 35% రాయితీ మంజూరు చేస్తారు. అర్హత కలిగిన ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల చొప్పున వారికి బ్యాంకు ద్వారా రుణం అందిస్తారు. లబ్ధిదారుడి వాటా ప్రాజెక్ట్ వ్యయంలో కనీసం 10శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తం బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా స్వయం సహాయ సంఘాల్లో ఉన్న సభ్యులకు ఈ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 200 యూనిట్ల ఏర్పాటుకు లక్ష్యంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 162 యూనిట్లకు డీపీఆర్ సిద్ధం చేశారు. వాటిలో 140 యూనిట్లు ఏర్పాట్లు ప్రక్రియ కొనసాగుతున్నది. మిగతా వాటి ఏర్పాటుకు మహిళలను చైతన్యం చేసేందుకు అధికారులు దృష్టి సారించారు.
దరఖాస్తుదారుడికి సంస్థ మీద యాజమాన్య హకు ఉండాలి. దరఖాస్తుదారుడు 18 సంవత్సరాల కంటే ఎకువ వయస్సు కలిగి ఉండాలి. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందడానికి అర్హత కలిగి ఉంటారు. దరఖాస్తుదారులు ప్రాజెక్ట్ ఖర్చులో 10శాతం వాటాగా డిపాజిట్ చేయాలి. అనంతరం బ్యాంక్ రుణాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. భూమి ఖర్చును ప్రాజెక్ట్ వ్యయంలో చేర్చరాదు. దీర్ఘకాలిక లీజ్ లేదా అద్దె గృహాన్ని చేర్చవచ్చు. అద్దె గృహం లీజ్ గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. వ్యక్తిగత ఆహార శుద్ధీకరణ సూక్ష్మ(మైక్రో) సంస్థల కోసం ఎంపిక ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకుంటారు.