ఖమ్మం, సెప్టెంబర్ 30: మౌలిక వసతుల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని రూ.90 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 28వ డివిజన్ శ్రీనివాసనగర్లో రూ.45 లక్షలు, 32వ డివిజన్ గ్రెయిన్ మార్కెట్ రోడ్లో రూ.45 లక్షలతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
నగరంలోని అన్ని డివిజన్లలోనూ సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని అన్నారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా, డీసీసీబీ చైర్మన్లు బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, గజ్జల లక్ష్మి, వెంకన్న, దోన్వాన్ సరస్వతి, పాలడుగు పాపారావు, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.