రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్ఎస్ హయాంలోనే సామాన్యులకు రాజకీయ పదవులు వచ్చాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం, నేలకొండపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. తెలంగాణ వస్తే రాష్ట్రమంతా అంధకారమవుతుందన్న నాయకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. నేలకొండపల్లి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
నేలకొండపల్లి, సెప్టెంబర్ 30: రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అందుకే వారి సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. నేలకొండపల్లిలో శుక్రవారం జరిగిన నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాలన్నీ రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. తెలంగాణ వస్తే రాష్ట్రమంతా చీకటిమయం అవుతుందని భయపెట్టిన నాయకులెవరూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని, కానీ స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. అన్నదాతలకు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. దేశంలోని ఏరాష్ట్రం కూడా ఇలా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంలేదని గుర్తుచేశారు. కర్షకుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా కల్లాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతుల భయపడాల్సిన పనేమీలేదని, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసుదన్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా నంబూరి శాంత, ఇతర డైరెక్టర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషనం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కేఎంసీ మేయర్ పూనకొల్లు నీరజ, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, పాలేరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.