‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు అస్తిత్వం కోసమే ఉద్యమించారు.. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రజలను ముందుండి నడిపి స్వరాష్ర్టాన్ని సాధించారు.. అనతికాలంలోనే రాష్ట్రంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.. రాష్ట్రం జాతి నిర్మాణంలో భాగం పంచుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘జాతీయ సమైక్యతా’ వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నది.. ఉత్సవాలు ప్రజలందరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు విడుదల చేస్తున్నారు. నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.. కార్యక్రమంలో డీసీసీబీ కూరాకుల పాల్గొన్నారు. – ఖమ్మం, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం: విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన