ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 1: పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నగరంలోని విన్ఫీల్డ్ హైస్కూల్ విద్యార్థులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. టెన్ జీపీఏ సాధించిన విన్ఫీల్డ్ విద్యార్థులు మంత్రి అజయ్ను ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలువగా వారందరికీ మంత్రి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విన్ఫీల్డ్ స్కూల్ యాజమాన్యం అత్యుత్తమ ప్రమాణాలు, విలువలతో కూడిన బోధన అందించడంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని విద్యార్థులకు, యాజమాన్యానికి సూచించారు. చదువుతోపాటు ఇతర రంగాల్లో ప్రావీణ్యం కల్పిస్తూ నూరు శాతం ఫలితాలతో విజేతలుగా తీర్చిదిద్దిన యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సాధన చేస్తే ఏదైనా సాధ్యమేననడానికి ఈ ఫలితాలే తార్కాణమన్నారు. ఈ కార్యక్రమంలో విన్ఫీల్డ్ విద్యాసంస్థల చైర్మన్ మన్నె కిశోర్కుమార్, కరస్పాండెంట్ గద్దె పుల్లారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ పోలవరపు శ్రీకాంత్, టీచర్లు పాల్గొన్నారు.