టేకులపల్లి, జూన్ 29 : టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు అన్నారు. బుధవారం టేకులపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అధ్యక్షతన ఇల్లెందు నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులు, టేకులపల్లి మండల స్థాయి నాయకులు, గ్రామశాఖ కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.
అనంతరం మండలంలోని తొమ్మిదోమైలుతండా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ కవిత, రేగా కాంతారావు పరిశీలించారు. పనుల నాణ్యత తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. గ్రామస్తులు మిషన్ భగీరథ వాటర్ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రేగలపాడు గ్రామంలో గ్రామశాఖ కమిటీ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యకర్త సురబాక నరేశ్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందడంతో అతడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, ఎంపీపీ భూక్యా రాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలూనాయక్, కంభంపాటి చంద్రశేఖర్రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పులిగండ్ల మాధవరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ రామానాయక్, బానోత్ కిషన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామశాఖ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.