భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో దళితబంధు లబ్ధిదారులు, అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులకు త్వరగా యూనిట్లు అందేలా చూడాలని ఆదేశించారు. దళితబంధు పథకంలో మంజూరైన ట్రాక్టర్లు, జీప్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ నవీన్కుమార్, పాల్వంచ కమిషనర్ చింతా శ్రీకాంత్, ఎంపీడీవోలు రవీందర్, రమేశ్, రామారావు, వెంకటలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ మేనేజర్ ఎల్వీ సత్యనారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
లక్ష్మీదేవిపల్లి, జూన్ 28 : మండలానికి సంబంధించిన 31మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాత పాల్వంచలోని తన నివాసంలో మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సోనా, ఎంపీటీసీ కొల్లు పద్మ, జక్కుల సుందర్, బత్తుల వీరయ్య, వినోద్, సర్పంచ్ శారద, రవి, పూర్ణ పాల్గొన్నారు.