తల్లాడ, మే 18: ఉపాధి హామీ పథకంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 300 కి.మీ మేర సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. బుధవారం ఆయన నారాయణపురం ఎన్నెస్పీ సిరిపురం మేజర్తో పాటు పినపాక వద్ద మైనర్ కాలువలో పూడికతీత పనులను పరిశీలించి మా ట్లాడారు. పూడికతీత పనులు పక్కాగా సాగాలన్నారు. సుమారు రూ.కోటి వ్యయంతో సాగునీటి కాలువల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన పూడిక తొలగిస్తున్నామన్నారు. మూడేళ్ల క్రితం నియోజకవర్గంలో 400 కి.మీ మేర సాగునీటి కాలువల్లో పూడిక తీయించామన్నారు. పనులను అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రశంసించారన్నారు. ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. దీనిపై ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనన్నారు.
ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు సత్వరం వేతనాలు అందజేయలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, ఏపీవో కోటయ్య, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, సర్పంచ్లు పొట్టేటి సంధ్యారాణి, వరపర్ల ఉమ, నాయకులు బద్ధం కోటిరెడ్డి, దిరిశాల దాసురావు, జీవీఆర్, మోదుగు ఆశీర్వాదం, బొడ్డు వెంకటేశ్వర్లు, మూకర ప్రసాద్, దూపాటి నరేశ్రాజు, కోడూరి వీరకృష్ణ, గుండ్ల నాగయ్య పాల్గొన్నారు.