ఖమ్మం వ్యవసాయం, మే 18: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు భారీగా సభకు తరలిరావాలని కోరారు. వారి వెంట కార్పొరేటర్లు మురళి, రామ్మోహన్రావు, నాయకులు మాధవరావు, రమేశ్, ఉపేందర్, వీరభద్రం, ప్రసన్నకృష్ణ, వెంకన్న, రమేశ్, పాపారావు, నాగేశ్వరరావు, సైదారావు, సాయికిరణ్, వాసు, ఉస్మాన్ ఉన్నారు.