మామిళ్లగూడెం, జూలై 23: రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లాలను ముందు వరుసలో ఉంచడంలో జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఆర్వీ కర్ణన్ అందించిన సేవలు జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టర్, జడ్పీ సీఈవోలుగా పనిచేసి బదిలీపై అదే హోదాల్లో కరీంనగర్ జిల్లాకు వెళ్లిన ఆర్వీ కర్ణన్, ప్రియాంక దంపతులను శనివారం సాయంత్రం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధ్యక్షతన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేంలో మంత్రి మాట్లాడుతూ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, సంఘాల ప్రతినిధులను సమన్వయం చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో కలెక్టర్గా కర్ణన్ ఎంతో పరిణితితో వ్యవహరించారని అన్నారు. ఎంతో విలువైన సేవలందించారని కూడా గుర్తుచేశారు. ముందుగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ కమల్రాజు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, జిల్లా అభివృద్ధికి కర్ణన్ దంపతులు చేసిన కృషిని అభినందించారు. మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనుబంధం మరువలేనిది..
ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధం మరువలేనిదని పూర్వ కర్ణన్ దంపతులు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు చూపించిన అభిమానం ఎంతో గొప్పదన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు.
అభినందనల వెల్లువ..
కలెక్టర్, జడ్పీ సీఈవోలుగా పనిచేసి బదిలీపై వెళ్తున్న కర్ణన్, ప్రింయాక దంపతులకు అభినందనలు వెల్లువెత్తాయి. మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వారిని ఘనంగా సన్మానించారు.