ఖమ్మం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నచ్చిన చోట కోరుకున్న తీరులో ఇల్లు.. విల్లా.. అపార్ట్మెంట్.. ఇలా ఏదైతేనేం..? వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా డెవలపర్స్, బిల్డర్స్ అత్యాధునిక ఇంజినీరింగ్, ఇంటీరియర్తో నివాసాలు నిర్మిస్తున్నది. కన్స్ట్రక్షన్ రంగంలో క్రేజీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రప్రభుత్వం నిర్మాణాలకు అ నుమతులు సులభంగా మంజూరు చేస్తుండడంతో నిర్మాణ రంగం ఊపందుకున్నది. ఈ రంగంలో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. తమకు నచ్చిన ఇల్లు కొని వినియోగదారులూ హ్యాపీగా ఫీలవుతున్నారు. వినియోగదారుల అర్హతలను బట్టి బ్యాంకులు వారికి రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణ శివార్లకు రహదారుల విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి.
విస్తరిస్తున్న బిల్డర్స్ కల్చర్..
గతంలో మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు పట్టణాలు, నగరాలకూ విస్తరిస్తున్నది. అందుకు అనుగుణంగా నిర్మాణ రంగం పుంజుకుంటున్నది. ఎంతో మంది ఔత్సాహికులు ఈ రంగంలో భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. కన్స్ట్రక్షన్పై క్రేజ్తో డెవలపర్స్ బిల్డర్స్గా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ దగ్గరుండి ఇల్లు కట్టించుకునేంత వెసులుబాటు లేదు. ఇప్పుడు ఎక్కువ మంది బిల్డర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. బిల్డర్స్ కేవలం అపార్ట్మెంట్లకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ నిర్మిస్తున్నారు.
వేలాది మందికి ఉపాధి..
నిర్మాణ రంగం మానవ వనరులపై ఆధారపడి ఉన్న రంగం. అపార్ట్మెంట్, విల్లా, ఇండిపెండెంట్ ఇల్లు.. ఇలా ఏదైనా పునాదుల నాటి నుంచి కార్మికుల అవసరం ఉంటుంది. ఇటుక తయారీ నుంచి ఇంటీరియర్ వరకు వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇంటీరియర్, పీవోపీ వర్క్స్కు పొరుగు రాష్ర్టాల నుంచీ కార్మికులు వస్తున్నారు. ఒక్కో బిల్డర్స్ వద్ద సుమారు వంద మంది కార్మికులకు పైగా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో కాస్త కుదేలైనప్పటికీ ఈ ఏడాది నిర్మాణ రంగం పుంజుకున్నది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో నిర్మాణ దశలో ఉన్న ప్రధాన నిర్మాణాలన్నింటినీ బిల్డర్సే నిర్మిస్తున్నారు. కొన్ని పేరున్న డెవలపర్ సంస్థలు ఒకే సమయంలో రెండు, మూడు ప్రాంతాల్లో వెంచర్లు వేస్తున్నాయి. మధ్యతరగతి వర్గాలను ఆకర్షించే ధరలతో ప్లాట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఓపెన్ ప్లాట్ల రూపంలో వెంచర్లకు సైతం ప్రజలు ఆసక్తి కనబరుస్తూ కొనుగోలు చేస్తున్నారు.
ప్రతి వెంచర్ అండర్ డ్రైనేజీల నిర్మాణం
ప్రతి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో అండర్ డ్రైనేజీ నిర్మిస్తున్నాం. అదే ‘సుప్రీం లీనస్ ఇండియా’ ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకలతోనే మేము నిర్మాణ రం గంలో రాణిస్తున్నాం. కొన్నేళ్లుగా విల్లాలు, అపార్ట్మెం ట్లు నిర్మిస్తున్నాం. వినియోగదారులతో పాటు వెంచర్ నిర్వాహకుల ప్రసంశలు అందుకుంటున్నాం. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లోనూ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు అపార్ట్మెంట్ల వైపు చూస్తున్నారు. బ్యాంక్లు హౌసింగ్ లోన్స్ ఇస్తుండడంతో సులువుగా సొంతింటి కలను నెరవే ర్చుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం పుంజుకుంటున్నది. ఎంతోమంది ఔత్సాహికులు ఈ రంగంలోకి కొత్తగా అడుగు పెడుతున్నారు.
నిర్మాణాలకు సులువుగా అనుమతులుఇష్టమైన రీతిలో నిర్మాణం..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం నగరాల విస్తరణ పెద్దపీట వేస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నది. బిల్డర్లు వినియోగదారులకు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఖమ్మం నగరానికి చుట్టు పక్కన ప్రాంతాల్లోని భూములపై ఎక్కువమంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాణ రంగమైనా, ప్లాట్లయినా.. ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా అది కస్టమర్లకు లాభమే.
– గరికపాటి విజయ్, సీఈవో, శ్రీసిటీ
ఓపెన్ ప్లాట్ల కొనుగోలుపై ఆసక్తి..
మా సంస్థ ఆధార్ బిల్డర్స్ ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలోని రఘునాథపాలెంలో వెంచర్ ఏర్పాటు చేశాం. వెంచర్కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. తొమ్మిదిన్నర ఎకరాలకు ఎల్పీ నంబర్ సాధించాం. డీటీసీపీ లేఅవుట్ల అనుమతులపై ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ అవగాహన కల్పించడంతో కస్టమర్లు డీటీసీపీ ఓపెన్ ప్లాట్లు కొనేందుకు ఆసక్తికనబరుస్తున్నారు.
సులువుగా డీటీసీపీ అనుమతులు..
రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నది. కలెక్టర్ వీపీ గౌతమ్ డీటీసీపీ అనుమతులు సత్వరం అందేలా చూస్తున్నారు. మా సంస్థ కస్టమర్ల నమ్మకానికి అనుగుణంగా ప్లాట్లు విక్రయిస్తున్నాం.
– ఖాదర్, కేకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, మేనేజింగ్ డైరెక్టర్, ఖమ్మం, హైదరాబాద్
మాస్టర్ ప్లాన్తో కార్యాచరణ..
అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాం. సుడా పరిధిలోని వెంచర్లు డీటీసీపీ లే అవుట్లతో విక్రయాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ నగరాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో చుట్టు పక్కల ప్రాంతా ల్లో గేటెడ్ కమ్యునిటీలు ఏర్పాటవుతున్నాయి.