మధిరరూరల్, డిసెంబర్ 16: మండలంలోని మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు శుక్రవారం సందర్శించి ఉపాధ్యాయుల అటెండెన్స్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధనపై తెలుసుకున్నారు. అదనపు గదులు కావాలని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు జడ్పీచైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన గదుల నిర్మాణానికి నిధుల మంజూరునకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని పలుగ్రామాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు శుక్రవారం పర్యటించారు. తొలుత మొలుగుమాడు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలతో మాట్లాడారు. చొప్పకట్లపాలెంలో మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గూడూరు రమణారెడ్డి తండ్రి సంగారెడ్డి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు చావా రామకృష్ణ, చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, కొండేపాటి సాంబశివరావు, రామిశెట్టి సుజాత, పొట్టపింజర చిట్టిబాబు, పోలు రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.