సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 9 : రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలో ముందుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. రేజర్లలో సొసైటీ ఆధ్వర్యంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గోదాం, అగ్రి అవుట్లెట్లను వారు శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు సొసైటీల సేవలను వినియోగించుకోవాలని కోరారు.
పేదలకు భరోసా సీఎంఆర్ఎఫ్
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 9 : వివిధ వ్యాధులతో బాధపడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి భరోసా కల్పిసున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేజర్లలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం ఆయన డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సర్పంచ్ జక్కుల ప్రభాకర్, సొసైటీ అధ్యక్షుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, గండ్ర సోమిరెడ్డి, చిలుకుర్తి కృష్ణమూర్తి, తుమ్మూరు శ్రీరాంప్రసాద్, నాయకులు భీమిరెడ్డి గోపాలరెడ్డి, గొర్ల వెంకటరెడ్డి, చింతల సురేందర్రెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కంభంపాటి రాంబాబు, గుర్రాల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.