సత్తుపల్లి, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘసంస్కర్తగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేసిన గొప్ప నేత అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు కూసంపూడి మహేశ్, సుజాత, కొత్తూరు ఉమామహేశ్వరరావు, మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, షేక్ చాంద్పాషా, తడికమళ్ల ప్రకాశ్రావు, అమరవరపు కృష్ణారావు, మరికంటి శ్రీను, కంటే అప్పారావు, శ్రీను, గాదె నర్సింహారెడ్డి, గుంజా వెంకటేశ్వర్లు, రత్నాకర్, కొలికపోగు వెంకటేశ్వరరావు, దండు ఆదినారాయణ పాల్గొన్నారు.
వైరా టౌన్, డిసెంబర్ 6 : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. వైరా క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళితుల సంక్షేమం కోసమే దళితబంధు పథకమని అన్నారు. కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రత్నం, కోసూరి శ్రీనివాసరావు, ముళ్లపాటి సీతారాములు, దార్న రాజశేఖర్, బాణాల వెంకటేశ్వరరావు, మిట్టపల్లి నాగి, మద్దెల రవి, పోలా శ్రీనివాసరావు, పసుపులేటి మోహన్రావు, మచ్చా బుజ్జి, వేల్పుల మురళి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. – నమస్తే నెట్వర్క్