కల్లూరు, డిసెంబర్ 3: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు. గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల విలువైన చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే సండ్ర వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేశారు ఆ చెక్కులతోపాటు తన సొంత ఖర్చులతో సమకూర్చిన చీరెలను కూడా లబ్ధిదారులకు అందించారు. అలాగే తన సిఫార్సుతో మంజూరైన రూ.5.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, సర్పంచ్ నామా రాధమ్మ వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు, నాయకులు నామా మైసయ్య, ఎస్కే ఖాదర్, మాడుగుల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.