కొణిజర్ల, నవంబర్ 22: ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచి కుటుంబ సభ్యుడిలా కాపాడుకుంటామని శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్ అన్నారు. పెద్దగోపతి, అనంతారం, బొట్లకుంటకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు మంగళవారం వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ దొడ్డా మాధవి, దొడ్డా బాబు, రంజిత్, కొండలు, కిశోర్, జయరాజు, రామారావు, శంకర్, వెంకట్, రాజు, రాంబాబు, గోపాల్, రవి, అనిల్, నాగరాజు, శిలురాజు, అశోక్, శ్రీను, సతీశ్, ప్రకాశ్, లెనిన్, ప్రవీణ్, విజయ్, బాలశౌరి, ప్రభాకర్, బాలరాజు, సురేశ్, అశోక్, నవీన్, నాగేశ్వరరావు, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సీత ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, బొర్రా రాజశేఖర్, జైపాల్, ఏలూరి శ్రీనివాసరావు, గుండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.