తిరుమలాయపాలెం, నవంబర్ 11 : అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 18 మందికి సీఎం సహాయ నిధి రూ.5.80 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బాషబోయిన వీరన్న, దేవరం దేవేందర్రెడ్డి, సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ధ్యాన మందిరం ప్రారంభం
కూసుమంచి రూరల్, నవంబర్ 11 : గ్రామస్తుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తన స్వగ్రామమైన రాజుపేటలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే రూ.2 లక్షల విరాళం అందజేశారు.
ధ్యాన కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ అన్ని వయస్సుల వారు ఈ కేంద్రానికి వచ్చి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. గ్రామంలో అఖండ శాఖాహార ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు కందాళ సురేందర్రెడ్డి, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, కల్లూరుగూడెం సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్ వాసంశెట్టి అరుణ, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం, పిరమిడ్ సొసైటీ ప్రతినిధులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
నేలకొండపల్లి, నవంబర్ 11 : మండలంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, మార్కెట్ చైర్మన్ శాంత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, నాయకులు వజ్జా శ్రీనివాసరావు, వంగవేటి నాగేశ్వరరావు, రవి పాల్గొన్నారు. రాజేశ్వరపురంలో ఇటీవల మృతి చెందిన ఆకుతోట అనంతలక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం పరామర్శించారు. ఆమె చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.