ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రారంభమైన సందర్భంగా మండల పరిధిలోని న్యూలక్ష్మీపురం, చిరుమర్రి పాఠశాలలను ఆయన ఆఖస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆయన పుస్తకాలూ, యూనిఫామ్ అందాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు యూనిఫామ్ ధరించకపోవటంతో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎమ్ కు సూచించారు.
మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం పట్ల డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత మండల కేంద్రం ముదిగొండలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సోమశేఖ శర్మ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ రామాచారి, ఏఓ రాధ, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ సూర్యనారాయణ, ఎంపీపీ హరిప్రసాద్, చిరుమర్రి సర్పంచ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.