స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరగుతున్నాయి.. ప్రతిఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు.. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేస్తున్నారు.. కొందరు వినూత్నంగా మువ్వన్నెలకు సెల్యూట్ చేస్తున్నారు. ఆదివారం వైరా, మధిరలో మత్స్యకారులు, స్విమ్మింగ్ అసోసియేషన్ నాయకులు తెప్పలతో జలాశయాలు, చెరువుల్లోకి దిగా జాతీయ జెండాలను ప్రదర్శించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములవుతున్నారు.. ఇంటింటిపై జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుతున్నారు.. విద్యాలయాల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశభక్తి గీతాలకు నృత్యం చేస్తూ స్ఫూర్తిని నింపుతున్నారు.. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు వీధుల్లో జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. –