ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్ట్ 12: ఇంజినీరింగ్లో ప్రవేశానికి జూలై 18, 19, 20, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇదే నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. వారిని కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి.
ఎంసెట్ ఫలితాల్లో వెలాసిటీ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లు సాధించారని ప్రిన్సిపాల్ శెట్టి లక్ష్మణ్రావు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో కృష్ణప్రసాద్ -3,032, ప్రియాంక -3,501, రవికిశోర్ -4,356వ ర్యాంక్లు సాధించారు. విద్యార్థులను కరస్పాండెంట్ రవి, డీన్ యాకూబ్ అభినందించారు.
ఇంజినీరింగ్ విభాగంలో న్యూవిజన్ కళాశాలకు చెందిన కె.వైభవ్- 54వ ర్యాంక్, లోహితశ్రీ- 283, శ్రీదుర్గ- 300, సాయిఅభిషేక్- 426, అభ్యుదయ్- 475, సాయిస్నేహిత్-609, సాయి అమృతవర్షిణి- 613, సానియా 614, జశ్వంత్- 618, వెంకటనిరంజన్- 660, సాయిచిన్మయి-709, వితిక-723వ ర్యాంక్లు సాధించినట్లు కళాశాల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం నుంచి 380 మంది, అగ్రికల్చర్ నుంచి 66 మంది పరీక్షకు హాజరు కాగా 236 మంది మంచి ర్యాంక్లు సాధించారన్నారు. ర్యాంక్లు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ గోపీచంద్, అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మచారి అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల విజయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్దుల్ కరీం-479, సుగమ్య 1227, అనూష 1,264, స్వర్ణ 1,288, శ్రావ్య 1,394, విష్ణువరుణ 1,625, శ్రీనివాస్ 2,570, రవీందర్ 2,833, సాయిచరణ్ 2,971 వ ర్యాంక్లు సాధించారన్నారు. విద్యార్థులను డైరెక్టర్స్ గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రామచందర్, అధ్యాపకులు అభినందించారు.
కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటారని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో కె.హేమంత్ మహేశ్వర్ -114, అక్షిత -144, హరిచందన -202, సుహానా -260, షణ్ముఖప్రియ -391, విశ్వనాథ్ -536వ ర్యాంక్లు సాధించారన్నారు. వెయ్యిలోపు 16 ర్యాంక్లు, 5వేల లోపు 61, 10వేల లోపు 146 ర్యాంక్లు సాధించినట్లు వివరించారు. విద్యార్థ్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డిజిఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాశ్, జి.గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్స్ అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని విద్యాసంస్థల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. కళాశాల నుంచి 160 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అత్యధిక మంది మంచి ర్యాంకులు సాధించారన్నారు. ధనుంజయ్-139వ ర్యాంక్, అన్షితారెడ్డి -450, చక్రధర్రెడ్డి -743, హేమంత్ -2,070, సీహెచ్ సరయు 2,231వ ర్యాంక్లు సాధించారన్నారు. 10వేల లోపు ర్యాంకులు 12 మంది, 25 వేల లోపు 28మంది ర్యాంక్లు సాధించారన్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
ఎంసెట్ ఫలితాల్లో రెజొనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించినట్లు కళాశాల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో దేవి సుమంత్ -35, సంజయ్ -106, జయసాయి -690, వర్మ -1,111, దీక్షిత్రెడ్డి -1,384, శివకృష్ణ -1,782, కౌటిల్య -2,262, ప్రణవ్తేజ -2,437 ర్యాంక్ సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్స్ సతీశ్, భాస్కర్రెడ్డి, శాంతి అభినందించారు.