శ్రీరాంపూర్, ఆగస్టు 12 : సింగరేణిలో బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఈ విషయమై సీఎండీ శ్రీధర్కు విజ్ఞప్తి చేయగా, సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో 190 మస్టర్లు నిండిన 3,800 మందికి ప్రయోజనం కలుగనున్నది. దీంతో బదిలీ వర్కర్లలో హర్షం వ్యక్తమవుతున్నది.
శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గనిపై బదిలీ వర్కర్ కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ కృషితోనే తమకు జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి లభిస్తున్నదని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డిని సన్మానించారు
ఆయన మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా 2020లో ఉద్యోగం పొందిన బదిలీ వర్కర్లు, 2020లో గానీ, 2021 డిసెంబర్ వరకు అండర్ గ్రౌండ్లో 190, ఉపరితల గనిలో 240 మస్టర్లు ఏదైనా ఒక ఏడాది పూర్తిచేసిన వారికి పదోన్నతి కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తమ అధ్యక్షుడు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి, సహాయ కార్యదర్శి భాస్కర్, గోప్యా, బదిలీ వర్కర్లు దార వంశీకృష్ణ, రౌతు సత్యనారాయణ, సురేశ్కుమార్, రమేశ్, తోట సాయి, రవితేజ, శ్రీనివాస్, రంగు రాజశేఖర్, విజయ్కుమార్, కటకం మహేశ్ పాల్గొన్నారు.