ఖమ్మం, ఏప్రిల్ 17: ఖమ్మం కార్పొరేషన్లోని 52, 56వ డివిజన్ల నుంచి 350 మంది కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి శనివారం మంత్రి అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన కాంగ్రెస్, సీపీఎం నాయకులకు మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. 56వ డివిజన్కు చెందిన సీపీఎం నాయకుడు, మాజీ కౌన్సిలర్ బుర్రి ఇందిర, పార్టీ నగర నాయకుడు బుర్రి వెంకట్కుమార్, నాయకులు సీహెచ్ వీరయ్య, బి.రాజు, బెల్లం కృష్ట పుల్లయ్య, బి.శ్రీధర్, వేమల వెంకట్, బుర్రి వర్షిని, శ్రీకాంత్, రమేశ్, మాగి వెంకన్న, కిన్నెర వెంకన్న, భవానీ, సుజాత తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్లో ఎన్నికలో సమష్టిగా పనిచేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నాయకులు తాజుద్దీన్, షౌకత్ ఉన్నారు.
నగరాన్ని నెంబర్వన్గా తీర్చిదిద్దుతా..మంత్రి అజయ్కుమార్
ఖమ్మం కార్పొరేషన్ను నెంబర్వన్గా తీర్చిదిద్దుతానని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని 2వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిలుమూరు కోటేశ్వరరావు (కోటి)తో పాటు మరో 20 మంది నాయకులు శనివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పనిచేసి అఖండ విజయం సాధిద్దామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 60కి 60 స్థానాలను దక్కించుని గులాబీ జెండా ఎగురవేద్దామన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, సన్నే మోహన్రావు, కృష్ణారెడ్డి, మేచిన్ని జనార్దన్, వేముల నర్సింహారావు, వేముల శ్రీను, మరికంటి శ్రీను, పొరళ్ల సైదులు, వెంకట్, బత్తుల నాగయ్య తదితరులు ఉన్నారు. చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, డివిజన్ అభ్యర్థి నర్రా యల్లయ్య, కుర్రా మాధవరావు ఉన్నారు.