ఖమ్మం వ్యవసాయం, జూన్ 11: రాష్ర్టానికి రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురిపిస్తున్నాయి.. సాగుకు అదును రావడంతో రైతులు పొలంబాట పట్టారు. రఘునాథపాలెం మండలంలో పత్తి విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వైపు వానలు, మరోవైపు పొలం పనుల కోలాహలంతో పొలాలు వానకాల శోభను సంతరించుకున్నాయి. పొలం దున్నే అన్నదాతలు, విత్తనాలు నాటే కూలీలతో కళకళలాడుతున్నాయి.