ఖమ్మం, మే 2: ఖమ్మం లకారం ట్యాంక్బండ్పై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిషరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం నటుడు జూనియర్ ఎన్టీఆర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.
విగ్రహావిషరణ ఏర్పాట్లపై చర్చించారు. కాగా, ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి తరలింపునకు సిద్ధంగా ఉంది. బేస్మెంట్తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటుచూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్పై ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్లతో దీనిని తయారు చేయించి ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతులను పొందడంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధుల కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహా తానా సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు.