సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆరు వ్యక్తిగత వాహనాలను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఆరు వాహనాలకు సంబంధించిన ఫొటో, డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తి చేశారు. వాహనాల్లో ఒకటి బెంజ్, టయోటా వెల్ఫైర్, 2 స్కార్పియోలు, జీప్, ఒక గూడ్స్ వెహికల్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిపై సుమారు రూ.80 లక్షల లైఫ్ ట్యాక్సీ చెల్లించారు.