ఖమ్మం : ఖమ్మంజిల్లా కళాకారులకు అంతర్జాతీయ జానపద కళాహంస అవార్డులు వచ్చినట్లు కళాకారుడు పమ్మి రవి తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ ల్లో ఖమ్మం జిల్లాకు చెందిన పమ్మి రవి, అలవల కృపానందం, గోవిందా గురవయ్య, బంకా భద్రయ్యలు జానపద కళాహంస అవార్డుకు ఎంపికయినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా డాక్టర్ సీతారాం, అరుణోదయ నాగన్న, కమర్తపు మురళి, డాక్టర్ కేవీ కృష్ణారావు, డోకుపర్తి సుబ్బారావులు అవార్డు గ్రహీతలను అభినందించారు.