కూసుమంచి రూరల్/ఖమ్మం రూరల్/ తిరుమలాయపాలెం/నేలకొండపల్లి/, జనవరి 9: పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేటకు చెందిన ఎమ్మెల్యే కందాళ అభిమాని ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా తన రక్తంతో ప్రత్యేకంగా తయారు చేయించిన చిత్రపటాన్ని ఎమ్మెల్యే కందాళకు అందజేశాడు.సర్పంచ్లు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అరుణ, మందడి పద్మ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి వడ్త్యా బాలకృష్ణ, ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మండల ఉపాధ్యక్షుడు వెంపటి రవి, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ దర్గయ్య, నాయకులు ముత్యం కృష్ణారావు, లక్ష్మణ్నాయక్, మట్టా వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, తిరుమలాయపాలెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, బోడ మంచానాయక్, తాతా రవీందర్, కొప్పుల శ్రీనివాసరావు, ఆర్మీ రవి, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, మరికంటి రేణుబాబు, వజ్జా శ్రీనివాసరావు, రాయపూడి శ్రీనివాసరావు, బాజా నాగేశ్వరరావు, వంగవేటి నాగేశ్వరరావు, నందిగామ కవితారాణి, కూరాకుల నాగేశ్వరరావు, గొలుసు రవి, కుదుగుంట్ల వీరారెడ్డి, మారగాని పద్మారావు, మాదాసు ఆదాం పాల్గొన్నారు.