కామేపల్లి, మే 10 : అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కొమ్మినేపల్లి సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి, ఎంపీటీసీ బోడేపూడి అనురాధ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అన్నారు. కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. కంటి వెలుగు శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొమ్మినేని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మూడ్ కృష్ణప్రసాద్నాయక్, సిబ్బంది తులసి, అంజమ్మ, సుధాకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుబల్లి, మే10: కంటి వెలుగు శిబిరం మండల పరిధిలోని కొత్తకుప్పెనకుంట్ల గ్రామంలో బుధవారం కొనసాగింది. శిబిరానికి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కారేపల్లి, మే 10 : గుట్టకిందగుంపు, కారేపల్లి, వెంకిట్యాతండాలలో బుధవారం నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమాల్లో 415 మందికి వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. వారిలో 58మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 46 మందికి శస్త్రచికిత్సలకు గుర్తించినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో వైద్యాధికారులు శ్రేష్ఠ సాఫల్య, రంజిత్, హిమబిందు, సిబ్బంది భద్రయ్య, విజయకుమారి, శీలం శ్యామల ఉండం రాధ, పొదెం నాగమణి, రవీందర్, ఉదయ్,ఇస్రత్, శంశుద్దీన్, ఉష,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, మే10: రెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బద్ధం నిర్మల ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు సర్పంచ్తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం నాణ్యమైన ఉచిత వైద్యసేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రవీంద్రారెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, బద్ధం కోటిరెడ్డి, జీ.వీ.ఆర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.