కామేపల్లి, డిసెంబర్, 17: కుష్ఠు రహిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నామని రాష్ట్ర అదనపు వైద్య సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం తాళ్లగూడెంలో వైద్య సిబ్బంది చేపడుతున్న సర్వేను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. వ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఇంటింటి సర్వే ఉపయోగపడుతుందన్నారు.
వ్యాధిగ్రస్తుల సర్వే వంద శాతం పూర్తి చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారిణి డాక్టర్ ప్రవీణ, పీఎంవో బోజ్యానాయక్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రచ్చా శ్రావణ్కుమార్, డీపీఎంవో కృష్ణ, లెప్రసీ నోడల్ పర్సన్ రాజు, ఎంపీహెచ్ఏ తులసీ, ఆశ పాల్గొన్నారు.
విశ్వనాథపల్లి ఆరోగ్య ఉప కేంద్రం సందర్శన
కారేపల్లి, డిసెంబర్ 17: మండలంలోని విశ్వనాధపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో కుష్ఠు, ఎయిడ్స్ నివారణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ రవీంద్రనాయక్ శనివారం సందర్శించారు. ఉపకేంద్రంలో జరుగుతున్న సర్వేపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో తిరుగుతూ సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పారామెడికల్ అధికారి కృష్ణ, మండల వైద్యాధికారి యాసా హన్మంతరావు, తేజశ్విని, సీహెచ్వో భద్రయ్య, సూపర్వైజర్ సూర్యం పాల్గొన్నారు.