సత్తుపల్లి టౌన్, మార్చి 8 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం పెద్దపీటవేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల శకటాలు(వాహనాలు) ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళా సంఘ సేవకులు, అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, మార్చి 8 : అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు ఏకం చేస్తూ మహిళలను అభివృద్ధి పథంలో నడపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బీరవల్లి రఘు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నదే సీఎం కేసీఆర్ తపన, ఆలోచన అన్నారు. తొలుత 450 మంది వివిధ రంగాలకు చెందిన మహిళలను సత్కరించారు. అనంతరం 81 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జిల్లా, రైతు బంధు సమితి మండల బాధ్యుడు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, సర్పంచ్ లక్కినేని నీరజ, బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, యూత్ మండల అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ, కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, కమ్లీ, మహిళలు పాల్గొన్నారు.