ఖమ్మం జిల్లాలోని అన్ని చర్చిల్లో శుక్రవాం గుడ్ ఫ్రైడే ప్రార్థనాలు జరిగాయి. క్రీస్తు విశ్వాసకులు క్రీస్తు వేషధారణలో సిలువ నమూనాలు మోస్తూ వీధి వీధినా ప్రదర్శన నిర్వహించారు. కీర్తనలు పాడుతూ క్రీస్తును స్తుతించారు. ఆయన త్యాగాన్ని కొనియాడారు. మత పెద్దలు క్రీస్తు మార్గంలో పయనించాలని సందేశాన్నిచ్చారు. ఆర్సీఎం, సీఎస్ఐ, పెంతెకోస్టు, ఎల్షద్దాయి, హోలీ ట్రినిటీ, గుడ్ షెపర్డ్, గాస్పెల్, హోసన్న మందిరం, ఏసన్నా జయమే మినిస్ట్రీస్.. ఇలా ఏ సంస్థకా సంస్థ తమ పద్ధతుల ప్రకారం ప్రార్థనలు చేశాయి..