పాల్వంచ, మే 24 : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న విద్యావంతుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేటర్లను కోరారు. శుక్రవారం పాల్వంచలోని కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వనమా పాల్గొన్నారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చిన రాకేశ్రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, ఆయనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తారన్నారు. కార్యక్రమంలో వనమా రాఘవేందర్రావు, కిలారు నాగేశ్వరరావు, కాల్వ ప్రభాకర్రావు, మంతపురి రాజుగౌడ్, ముచ్చర్ల రమణమూర్తి నాయుడు, బి.మధుచంద్, రేగడి మధు, ఎన్. శ్రీను, కె.హర్షవర్ధన్, సమ్మయ్య గౌడ్, రంజిత్, ఎం.కిరణ్ పాల్గొన్నారు.