పల్స్పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు హాజరయ్యారు.
ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్, వైరాలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, సత్తుపల్లిలో మట్టా రాగమయి, కొత్తగూడెంలో కలెక్టర్ ప్రియాంక ఆల, డీఎంహెచ్వో శిరీష, మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, పాల్వంచలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-నమస్తే నెట్వర్క్,మార్చి 3