పాల్వంచ, ఫిబ్రవరి 4 : పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలోని కేటీపీఎస్లో టీఎస్జెన్కో హాకీ, బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలు రెండోరోజు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. మొదటిరోజు జరిగిన మ్యాచ్లో హాకీ మ్యాచ్లో కేటీపీఎస్ 5,6 దశల జట్టు 7వ దశ జట్టుపై విజయం సాధించింది. బీటీపీఎస్ జట్టు విద్యుత్ సౌధ జట్టుపై విజయం సాధించింది.
అదేవిధంగా కేటీపీఎస్ 7వ దశ జట్టు, వైటీపీఎస్ జట్టుపై 15 బాస్కెట్లతో విజయం సాధించింది. బాస్కెట్బాల్ రిఫరీగా జబ్బార్, హాకీ ఎంపైర్లుగా ఇలియాజ్, మీరాలు వ్యవహరించారు. ఈ క్రీడలను జెన్కో స్పోర్ట్స్ డిప్యూటీ సెక్రటరీ లోహిత్ ఆనంద్ పర్యవేక్షించారు.