సత్తుపల్లి, డిసెంబర్ 14 : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో అర్హులైన రైతులు తమ ఖాతాలో నగదు జమ కావాలంటే ఈ-కేవైసీ (ఫోన్నెంబరు, ఆధార్నెంబర్ లింకు) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల రైతులకు సూచించారు. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో పంటకోత ప్రయోగాలను బుధవారం పరిశీలించి మాట్లాడారు.
అనంతరం గంగారం రైతువేదికలో ఈకేవైసీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,76,736 మంది రైతులు ఈ పథకంలో లబ్ధ్దిపొందుతుండగా ఇందులో ఇంకా 26,513 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని, వారంతా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ యు.నర్సింహారావు, ఏవోలు వై.శ్రీనివాసరావు, పి.రామ్మోహన్, ఖమ్మం సాంకేతిక వ్యవసాయాధికారి రాజు, ఏఈవోలు స్వాతి, ఆశాజ్యోతి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.