ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలో అడ్మిషన్స్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఓల్డ్ బ్యాచ్కు సప్లమెంటరీ పరీక్షలు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు పోందిన ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని డీడీ సమ్మయ్య తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు రూ.300ల అపరాధ రుసుంతో ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వివరాలకు 7382929607లో సంప్రదించాలని కోరారు.