దుమ్ముగూడెం, జనవరి 31 : అంతర్గత రోడ్ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. తూరుబాక పంచాయతీ పరిధి రామకృష్ణాపురంలో రూ.5 లక్షలు, బి.కొత్తగూడెం పంచాయతీ పరిధి బండారిగూడెంలో సీడీపీ నిధులు రూ.4 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, కార్యదర్శి కణితి రాముడు, సర్పంచ్లు భూక్యా చందు, కాటిబోయిన వెంకటేశ్వర్లు, సోడె కొండయ్య, సొసైటీ డైరెక్టర్ బొల్లి వెంకట్రావు, జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.