ఎర్రుపాలెం : ఖమంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దమళ్ల శ్రీనివాసరావు కాకతీయ యూనివర్సిటీ వైస్ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ, జిల్లా విద్యా, వైద్య కమిటీ మెంబర్ శీలం కవిత, సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఎంపీటీసీ యన్నం అన్నపూర్ణ, సొసైటీ అధ్యక్షుడు శీలం అక్కిరెడ్డి, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.