ఖమ్మం వ్యవసాయం, జనవరి 10: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. నగరంలోని అన్నం ఫౌండేషన్కు వేలాది రూపాయల విలువైన దుప్పట్లు, వస్ర్తాలు, బియ్యం బస్తాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ రీజినల్ హెడ్ మురళీపార్థసారథి మాట్లాడుతూ.. ఎందరో అభాగ్యులను చేరదీసి ఆదరిస్తున్న అన్నం ఫౌండేషన్ నిర్వాహకుల సేవలు అభిందనీయమని అన్నారు.
వారికి తమ వంతుగా సాయం అందించాలనే ఉద్దేశంతోనే సామూహికంగా ఉద్యోగులంతా వితరణ చేపట్టడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఏజీఎం రాజశేఖరం, ఏజీఎం వెంకటేశ్వరరావు, సీఎం సంజయ్తోపాటు ఆయా బ్రాంచ్ల ఉద్యోగులు పాల్గొన్నారు.