మామిళ్లగూడెం, జూన్ 12: ఐక్యతను చాటేందుకు 2కే రన్ ఎంతో దోహదపడుతోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా వ్యాప్తంగా ‘తెలంగాణ రన్’ను ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ 2కే రన్ కార్యక్రమం నగరంలోని పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్బండ్ వరకు కొనసాగింది. ముందుగా ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు, మేయర్ నీరజ జెండా ఊపి 2కే రన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తెలంగాణ ప్రగతిని చాటుతూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన తెలంగాణ 2కే రన్ విజయవంతం చేశామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై రన్ను విజయవంతం చేయడం గొప్ప విషయమని అన్నారు. సీపీ విష్ణు మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి రన్నింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రన్ అనంతరం కలెక్టర్, పోలీస్ కమీషనర్, ఇతర అధికారులు కలిసి ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా చివరి పాయింట్కు ముందుగా చేరుకున్న 25 మందికి కలెక్టర్, మేయర్ పతకాలు అందజేసి అభినందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బచ్చు విజయకుమార్, ఆదర్శ్ సురభి, స్నేహలత మొగిలి, రాధికాగుప్తా, మయాంక్ సింగ్, సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, అభినాశ్ కుమార్, రామోజీ రమేశ్, పీవీ గణేష్, ప్రసన్నకుమార్, పరంధామరెడ్డి, కర్నాటి కృష్ణ, రాపర్తి శరత్, దండా జ్యోతిరెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు.