కారేపల్లి, జూలై 08 : ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న సింగరేణి(కారేపల్లి) మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మం పట్టణంలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తండూరి దయాకర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులు చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాలకు చెందిన నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.