మామిళ్లగూడెం, డిసెంబర్ 14 : ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఓటర్ జాబితా రూపకల్పనపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 26వ తేదీ లోపు పరిశీలించి పరిష్కరించాలని, అర్హలందరికీ ఓటుహకు కల్పించాలని సూచించారు.
18 సంవత్సరాల నిండిన దివ్యాంగులందరికీ ఓటు హకు కల్పించి, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని అన్నారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, స్రూటీని సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో సదరం దరఖాస్తుల ద్వారా 28,417 దివ్యాంగ ఓటర్లను గుర్తించామని, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరధ, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సదరం దరఖాస్తుల ద్వారా దివ్యాంగ ఓటర్లను గుర్తించామని, మూడు రోజుల్లో పోలీస్ కే్రందాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేక ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లాలోని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో స్వర్ణలత, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, రామకృష్ణ, నవీన్ పాల్గొన్నారు.