ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల సందడి నెలకొంది. శ్రావణ మాసం
సందర్భంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇంటి వద్ద ఉదయమే నైవేద్యం వండి..
పసుపు, కుంకుమ, పూలు, వేపాకులతో బోనం కుండను తీర్చిదిద్ది పూజలు చేశారు.
అనంతరం మేళతాళాలు, నృత్యాల నడుమ గ్రామ దేవతలు ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లికి
బోనాలు సమర్పించేందుకు బయలుదేరారు. ఆలయాల వద్ద అమ్మవారికి బోనాలు
చెల్లించి.. పూజలు చేసి.. మొక్కులు తీర్చుకున్నారు. -నమస్తే నెట్వర్క్