ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సన్నిధిలోని శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కే.జగన్మోహన్రావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఆలయ ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, తదితరులు పాల్గొన్నారు.