చింతకాని: మండల పరిధిలోని బస్వాపురం గ్రామంవాగులో జాలర్ల వలలో వింత చేప చిక్కింది. మంగళవారం మధ్యాహ్నం స్ధానిక జాలర్లు గ్రామసమీపంలోని వాగులో చేపల వేటకు వెళ్ళగా సుమారు అరకేజీ బరువులో ఉన్న నల్లటి మచ్చలు, ముళ్లు ఉన్న అరుదైన చేప వలలో చిక్కింది. వింత చేప విషయమై మండల పశువైద్యాధికారులు డాక్టర్ రాంజీ, ఉప్పు శ్రీహరిలను సంప్రదించగా దీనిని “డెవిల్ ఫిష్” అంటారని చెప్పారు.
ఇది ఎక్కువగా సముద్ర జలాలు, నదుల్లో మాత్రమే నివసిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తుందని వారు తెలిపారు. దీనిని “డెవిల్ఫిష్” లో మాంసం ఉండదని, తోటి చేపలనే ఆహారంగా తింటుందని వివరించారు. పదునైన దంతాలతో, నోరు శరీరం కిందిభాగంలో ఉంటుందని వైద్యులు తెలిపారు. వీటికున్న పదునైన దంతాలతో వలలను సైతం కోరికి వేస్తుందని వారు అన్నారు.