సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 20: మండలంలోని గంగారం 15వ బెటాలియన్ను బుధవారం బెటాలియన్ల అదనపు డీజీపీ స్వాతి లక్రా సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్లో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ సంప్, ఏకలవ్య వెల్ఫేర్ కాంప్లెక్స్ ఆఫీసు, టూవీలర్ మెకానిక్ షెడ్, మినీ గెస్ట్హౌస్, నర్సరీలను ప్రారంభించారు. అనంతరం బెటాలియన్లోని బీటీసీ ట్రైనింగ్ సెంటర్, బెటాలియన్ మైన్ ఆఫీస్, బెటాలియన్ ఫైరింగ్ రేంజ్లను పరిశీలించారు. అక్కడి అధికారులు, సిబ్బందితో కలిసి దర్బారు నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు, సహాయ దళాధిపతి ఆర్.నాగేశ్వరరావు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.