ఖమ్మం:నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా విడుదల చేశారు. అన్ని విభాగాల నుంచి 1088 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, 836మంది ఉత్తీర్ణతను సాధించారని, 77శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, నారాయణ స్వామి, వెంకటేశ్వరరెడ్డి, రత్నప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.