ములకలపల్లి, ఆగస్టు 4: రానున్న మూడు నాలుగేళ్లలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు సాయం అందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. శతాబ్దాలుగా అణగదొక్కబడిన దళితులను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ములకలపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. ఇక్కడి లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. జగన్నాథపురంలో కనకం సతీశ్, మూకమామిడిలో రింగు బాలకృష్ణకు మంజూరైన టెంట్హౌస్ యూనిట్లను ప్రారంభించారు.
ములకలపల్లిలోని ఏసుబాక వెంకటేశ్వరరావుకు మంజూరైన సూపర్బజార్ యూనిట్ను, భగత్సింగ్నగర్లో మోటా రవికి మంజూరైన కాంక్రీట్ మిక్సర్ యూనిట్ను ప్రారంభించారు. పొగళ్లపల్లిలో పత్తిపాక భిక్షమయ్యకు ట్రాక్టర్ యూనిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరిగి చెల్లించే అవసరం లేకుండా దళితులకు నేరుగా రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం ములకలపల్లిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మూకమామిడిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు మట్ల నాగమణి, శెనగపాటి మెహరామణి, తాటి తులసి, సున్నం సునీత, గడ్డం భవాని, సున్నం సుధాకర్, బైటి రాజేశ్, వాడే నాగరాజు, కీసరి శ్రీనివాస్, సున్నం సుశీల, భీమినేని భద్రం, సున్నం నాగమణి, మోరంపూడి అప్పారావు, నాగళ్ల వెంకటేశ్వరరావు, బత్తుల అంజి, శెనగపాటి అంజి, నాగేశ్వరరావు, వీరభద్రం, లక్ష్మయ్య, పువ్వాళ్ల మంగపతి, శెనగపాటి రవి, పుష్పాల చందర్రావు, పామర్తి వెంకటేశ్వరరావు, అడపా నాగేశ్వరరావు, కోమాళ్ల దుర్గాప్రసాద్, కుంజా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.