ఖమ్మం : కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.టేకులపల్లి గ్రామం ఇల్లందు మండలానికి చెందిన అన్నబత్తుల అభిలాష్కు 20ఏండ్ల జైలుశిక్షతోపాటు10వేల రూపాయల జరిమాన విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.చంద్రశేఖర్ ప్రసాద్ తీర్పు ఇచ్చారు. నిందితుడు అభిలాష్కు కూతురు,కొడుకు ఉన్నారు. కుమార్తెను భయపెట్టి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి అభిలాష్.
దీంతో కూతురు అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తండ్రి వేధింపులు భరించలేక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు, కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువైందని భావించి తీర్పు ఇచ్చారు.