ఖమ్మం: చాలా కాలం తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు పత్తి ,మిర్చి ధరలు . ఏసీ రకం మిర్చిపంటకు జాతీయ స్థాయిలోనే తేజా రకం పంటకు ఖమ్మం మార్కెట్లో రికార్ఢు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. పత్తి పంట సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు అత్యంతగా ధర పలుకుతుంది. ఈ సంవత్సరం భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తికి మద్దతు ధర క్వింటాల్ రూ 6వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ పంటకు జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో సీజన్ ప్రారంభం నుంచే క్వింటాల్ రూ. 7వేల నుంచి ప్రారంభం అయ్యింది.
పంట చేతికి వచ్చే సరికి 8వేల పైబడి పలకడంతో ఈ సంవత్సరం సాగు చేసిన రైతులకు ధర కలిసి వచ్చినట్లయింది. ఉదయం జరిగిన ఈ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటీ పడటంతో గరిష్ట ధర క్వింటాల్ రూ 8,400 పలికింది. ఖమ్మం మార్కెట్కు వచ్చే పంటలో మరో ప్రధాన పంట తేజా రకం మిర్చి పంట. గత సంవత్సరం ఇదే మార్కెట్లో ఏసీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ. 22వేలు పలికి వ్యాపారులతో పాటు, అధికారులు, అన్నదాతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సరిగ్గా ఏడాది తరువాత శుక్రవారం మార్కెట్లో జరిగిన జెండాపాటలో క్వింటాల్ 19.525 పలికింది.